టిటిడి వెంకటేశ్వర ఆపన్న హృదయ పథకానికి పత్తి చంద్రశేఖర్ లక్ష విరాళం
- ఏటీపీ టీటీడీ ఈవోకు చెక్ అందజేసిన పత్తి చంద్రశేఖర్
పుట్టపర్తి నియోజకవర్గం: తిరుమల తిరుపతి దేవస్థానం చిన్నపిల్లల గుండె ఆపరేషన్ల కోసం ఏర్పాటుచేసిన శ్రీ వెంకటేశ్వర ఆపన్న హృదయ పథకానికి జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి, పుట్టపర్తి నియోజకవర్గం ఇన్చార్జ్ పత్తి చంద్రశేఖర్ రూ లక్ష రూపాయలు వితరణ గావించారు. మంగళవారం చెక్ ను టిటిడి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి, టిటిడి పాలకమండలి సభ్యులు అశ్వర్థ నాయక్ సమక్షంలో అందజేశారు. తన మాతృమూర్తి పత్తి సరోజమ్మ కోరిక మేరకు రూ లక్ష రూపాయల వితరణ చేసినట్టు పత్తి చంద్రశేఖర్ తెలిపారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-27-at-8.16.01-PM-1024x768.jpeg)