జై చంద్ర రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన పోతుల సాయినాథ్
తంబళ్లపల్లె నియోజకవర్గం: ములకలచెరువులో తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నియమితులైన దాసరిపల్లి జై చంద్ర రెడ్డిని జనసేన పార్టీ ఆదేశాల మేరకు దాదాపుగా 50 వాహనాలతో 500 మంది జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులతో తంబళ్లపల్లి జనసేన పార్టీ ఇంచార్జ్ (పిఓసి) పోతుల సాయినాథ్ భారీ ర్యాలీగా వెళ్లి జనసేన పార్టీ తరపున శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన పార్టీ తరఫున మనసా వాచా కర్మేనా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నిర్ణయానికి కట్టుబడి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, ఉమ్మడి అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి కానుకగా ఇస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆరు మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-28-at-6.25.53-PM-1024x462.jpeg)