అంగరంగ వైభవంగా జనచైతన్య ప్రజా యాత్ర

ప్రకాశం జిల్లా, సంతనూతలపాడు నియోజకవర్గం సమన్వయకర్త కందుకూరి బాబు, జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి బి.ఎన్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నాగులుప్పలపాడు నుండి చదలవాడ వరకు మహా పాదయాత్ర జనసేన పార్టీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఆదివారం సంతనూతలపాడు నియోజకవర్గం పరిధిలో నాగులుప్పలపాడు మండలంలో జన చైతన్య ప్రజా యాత్ర నాగులుప్పలపాడు ఆంజనేయస్వామి విగ్రహం నుండి చదలవాడ ఆంజనేయ స్వామి విగ్రహం వరకు జరిగింది. ఇందులో భాగంగా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఉమ్మడి అభ్యర్థి బి.ఎన్. విజయ్ కుమార్ సంతనూతలపాడులో ప్రమాదావశాత్తు మరణించిన 4 గురి జనసైనికుల కుటుంబాలను కలసి వారికి 10 వేల చొప్పున ఆర్థిక సహాయం చేయటం జరిగింది. తదనంతరం ఎస్.టి కాలనీలో 1,80000 వ్యయంతో జనసైనికులు స్వంత నిధులతో మంచి నీటి పైపు లైన్ మరియి రోడ్ ఎర్పాటు చేయటం జరిగింది. ఆ పైప్ లైన్ ఈ రోజు న ప్రారంభించటం జరిగింది. ఈ కార్యక్రమంలో సంతనూతలపాడు నియోజకవర్గ సమన్వయకర్త కందుకూరి బాబు, జనసేన &టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బి.ఎన్ విజయ్ కుమార్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దపూడి విజయ్ కుమార్, జిల్లా సంయుక్త కార్యదర్శి నూనె సురేష్ బాబు, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు పసుపులేటి చిరంజీవి, పెంట్యాల కోటి, కొనిజెటి ధనుష్, భూపతి మురళి , నున్న బాలసుబ్రమణ్యం, ఫణింద్ర ముద్రగడ, పల్లెపు శివప్రసాద్, కందుకూరి వాసు, ఇంకొల్లు శ్రీమన్నారాయణ, పేర్ణమిట్ట శ్రీనివాస్ పాల్గొన్నారు.