జనసేన కార్యాలయం ప్రారంభించిన పంతం నానాజీ

కాకినాడ రూరల్, నడకుదురు గ్రామ కమిటీ అధ్వర్యంలో బుధవారం పంతం నానాజీ చేతుల మీదుగా జనసేన పార్టీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పంతం నానాజీ మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో జనసేన-టీడీపి పార్టీ అఖండ మెజారిటీతో విజయ ఢంకా మోగిస్తోంది అని ధీమా వ్యక్తం చేశారు. జనం కోసం పవన్ – పవన్ కోసం మనం పాదయాత్ర ద్వారా ప్రతి గడపకు వెళ్లి తెలుసుకున్న సమస్యలను ఉమ్మడి ప్రభుత్వంలో పరిష్కరిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు చప్పిడి వెంకటేశ్వర రావు, దేవు వెంకన్న, జయేంద్ర బాబు, పోతల గోవింద్, యాసలపు విష్ణు, జనసేన పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులు, జనసైనికులు మరియు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.