వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ మహాన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న జ్యోతుల శ్రీనివాసు

కాకినాడ జిల్లా, పిఠాపురం నియోజకవర్గం, గొల్లప్రోలుమండలం చేబ్రోలు గ్రామం హరేరామ ఆలయం ప్రాంగణం నందు గల శ్రీమతి మాతా గోవిందమాత సమేత వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయము నందు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మాతా గోవిందమాంబల ద్వాదశ కళ్యాణ ఆరాధన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా గురువారం మహాఅన్నదాన కార్యక్రమానికి శ్రీమతి మాతా గోవిందమాత సమేత వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయము కమిటి వారి ఆహ్వానం మేరకు సాయిప్రియసేవాసమితి వ్యవస్థాపకాధ్యక్షులు మరియు జనసేన జిల్లాకార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు మహాఅన్నదాన కార్యక్రమానికి హజరయి ముందుగా శ్రీమతి మాతా గోవిందమాత సమేత వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయము నందు వీర బ్రహ్మేంద్రస్వామి, గోవిందమాంబలను దర్శనం చేసుకుని అనంతరం మహా అన్నదాన కార్యక్రమంలో వడ్డన చేశారు. మహా అన్నదాన కార్యక్రమానికి తన వంతు 2000 రూపాయలను విరాళంగా జ్యోతుల శ్రీనివాసు అందజేశారు. ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ వీరబ్రహ్మేంద్రస్వామి వారు తన రచనల ద్వారా ప్రతి వ్యక్తికి భవిష్యత్ కాలం గురించి తెలియజేశారని వీరబ్రహ్మేంద్రస్వామి వారు యొక్క బోధనలు మనందరికీ ఆదర్శనీయమని, వీరబ్రహ్మేంద్రస్వామి బోధనలను నేటి కలియుగంలో ఉన్న ప్రతి ఒక్కరూ చదివి వాటిని ఆదర్శంగా తీసుకోంటే మనం ఉత్తమపౌరులుగా, శాంతిగా బ్రతకడానికి అవకాశం ఏర్పడుతుందని ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గంటా గోపి, కొమ్మొజు వీరబ్రహ్మచారి, కొత్తపల్లి నాగేశ్వరరావు, కొమ్మొజు రాము, నక్కా ఆనందరావు, గారపాటి దేవుడు, నెల్లిపూడి సురేష్, పెదపూడి వరహలరావు, గుంటముక్కల ఆనందరావు, వీరవీల్లి వీరబాబు, కొమ్మొజు పెదరాము, గుంటముక్కల నానాజీ, వీరవీల్లి నాగేశ్వరరావు, కొమ్మొజు ప్రసాద్, గుండ్రోజు బాబురావు, నక్కా బాబులు, వీరవీల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.