శేరిలింగంపల్లి జనసేన ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

శేరిలింగంపల్లి, జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంఛార్జి డాక్టర్.మాధవరెడ్డి ఆదేశాల మేరకు శేరిలింగంపల్లి 106 డివిజన్ అద్యక్షురాలు శ్రీమతి దొంతోజు ఇందుమతి నాయకత్వంలో మరియు మదర్థెరిస్సా బ్లడ్ సెంటర్ వారి సౌజన్యంతో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల సహాయార్థం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ కార్యకర్తలు, యువకులు విశేషంగా పాల్గోని రక్తదానం చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరం ద్వారా రక్తం అందక ఇబ్బంది పడుతున్న ఎంతో మంది చిన్నారుల జీవితాలలో వెలుగు నింపుతుంది తెలియచేశారు. సమాజం పట్ల బాధ్యత, సేవ చేసే లక్షణం కలిగి ఉండటం అరుదుగా ఉన్న నేటి సమాజంలో జనసేన పార్టీ చేపట్టిన ఈ రక్తదాన శిబిరం కార్యక్రమం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు, ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన పార్టీ డివిజన్ కో-ఆర్డినేటర్లు వీర మహిళలు, జనసైనికులు పాల్గొని విజయవంతం చేయటం జరిగింది.