నగర కమిటీ నాయకులతో సమీక్షా సమావేశం
ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం నగర కమిటీ నాయకులతో మరియు 7వ, 8వ డివిజన్ నాయకులతో ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం నగర కమిటీ నాయకులతో పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని వారికి రెడ్డి అప్పలనాయుడు సూచించారు. ఈ సమావేశంలో ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నగర కమిటీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-10-at-13.06.20-1024x561.jpeg)