నర్సిపురం గ్రామంలో దిగ్విజయంగా జనసేన ఆత్మీయ సమావేశం

పార్వతీపురం నియోజకవర్గం, జనసేనపార్టీ మండల అధ్యక్షురాలు ఆగూరు మణి అధ్యర్యంలో జనసేనపార్టీ ఆత్మీయ సమావేశం ఏర్పాటుచేశారు. సమకాలీన అంశాలపై చర్చించారు. జరగనున్న ఎన్నికల్లో పార్వతీపురం నియోజకవర్గంలో జనసేన-తెలుగుదేశం ఉమ్మడి జెండా పాతడమే ప్రధాన ఎజెండా అని, ఎన్ని అవాంతరాలు ఎదురైనా తగ్గేది లేదని, నిజాయితీ, చిత్తశుద్ధి లేని, రాష్ట్రాన్ని పీక్కుతింటున్న అవినీతి రాజకీయ రాబందుల్ని వెళ్ళగొట్టడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. వైసిపి సిధ్ధం..! అంటే మాకు మీ అవినీతిపై యుధ్ధం..! అంటూ హెచ్చరించారు. జనసేన నాయకులు మాట్లాడుతూ దేశానికి యువత వెన్నెముక. అలాంటి యువ వనరుల్ని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సుస్థిర స్థానం కల్పించాలని సూచించారు. ఉమ్మడి కార్యాచరణపై దృష్టి సారించాలి, వ్యూహాత్మక ప్రణాళికతో ముందుకు వెళ్ళాలని చెప్తూ, పార్వతీపురం నియోజకవర్గంలో జనసేన-తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి బోనెల విజయ్ చంద్ర గెలుపు తథ్యమని ఘంటాపథంగా చెప్పారు. దానికోసమై యువత నిర్విరామంగా, శక్తి వంచన లేకుండా అందరూ కలిసి బేధాభిప్రాయాలు లేకుండా కృషి చెయ్యాలని కోరారు. ఈ కార్యక్రమానికి ఆయా ప్రాంతాల నుండి జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.