జనసేన-టీడీపీ ఆత్మీయ సమావేశం

గజపతినగరం, టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్ధి కొండపల్లి శ్రీనివాసరావు మరియు జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలు మాజీ మంత్రివర్యులు శ్రీమతి పడాల అరుణ పిలుపు మేరకు గజపతినగరం నియోజకవర్గ జనసేన ముఖ్య నాయకులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇరుపార్టీల ముఖ్య నాయకులు 2024లో జనసేన-టీడీపీ గెలుపే లక్ష్యంగా అందరం కలిసి పనిచేస్తాం ఎక్కువ మెజారిటితో గెలిపిస్తాం అని వివరించారు. ఈ ఆత్మీయ సమావేశంలో సీనియర్ నాయకుడు పడాల శరత్, దత్తిరాజేరు మండల అధ్యక్షులు చప్పా అప్పారావు, గజపతినగరం మండల అధ్యక్షులు మునకాల జగన్నాథరావు, జిల్లా కార్యనిర్వహణ కమిటీ సభ్యులు మామిడి దుర్గాప్రసాద్, చీపురుపల్లి నియోజకవర్గ ఐటీ కో-ఆర్డినేటర్ అగురు వినోద్ కుమార్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు సౌమిత్రి త్రివేది, రాజు, సింహాద్రి ప్రవీణ్, సింగారపు రామకృష్ణ, సారిక మురళి, గేదెల శేఖర్, రామచంద్ర, శంకర్, యస్వంత్, అనిల్, అనంత్, సాయి లోకేష్, సురేంద్ర, పరమేష్ మరియు సైనికులు తెలుగుదేశం కార్యకర్తలు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.