కాళీపట్నం వెస్ట్ లో జనంలోకి జనసేన

జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా, మొగల్తూరు మండలం, కాళీపట్నం వెస్ట్ పంచాయితీ, గాంధీ బొమ్మ సెంటర్ నుండి బొమ్మిడి నాయకర్ కు మద్దతుగా, ప్రచారం నిర్వహిస్తున్న జనసేనపార్టీ నర్సాపురం నియోజకవర్గం ఇంచార్జ్ బొమ్మిడి నాయకర్ సతీమణి బొమ్మిడి సునీత . ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, కాళీపట్నం గ్రామంలో త్రాగునీటి సమస్య, డ్రైనేజి సమస్య, అంతర్గత రహదారులు వంటి అనేక సమస్యలు ఉన్నాయని, ప్రస్తుత ప్రభుత్వం వీటిపై ఏమాత్రం దృష్టి సారించక, అభివృద్ధి కి నోచుకోలేదని అన్నారు. వైసిపి ప్రభుత్వంలో బిసి లకు రక్షణ లేకుండా పోయిందని,రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ప్రస్తుత వై సి పి ప్రభుత్వాన్ని గద్దె దింపి, జనసేన – టిడిపి పొత్తుకు పట్టం కట్టాలని బొమ్మిడి సునీత పిలుపునిచ్చారు. రాష్ట్రంలో జనసేన – తెలుగుదేశం కూటమిని బలపర్చాలని, ఉమ్మడి అభ్యర్థి బొమ్మిడి నాయకర్ ను భారీ మెజారిటితో గెలిపించాలని కోరుతూ, కరపత్రాలను పంచి, ఓట్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కె. పి పాలెం నార్త్ జనసేనపార్టీ నాయకులు రామాని చిన్నారి, అద్దంకి రాధాకృష్ణ, పోతుల తాతాజీ, రావూరి అంజి, రావూరి రాజు,తిరుమల దొరబాబు, గన్నాబత్తుల సాయి, పెచ్చేటి కమల్ కిషోర్, అడపా వంశీ,కౌరు స్వామి, సర్పంచ్ బందెల భారతి రవీంద్ర, కౌన్సిలర్లు కొప్పాడ కృష్ణవేణి, బొమ్మిడి సూర్యకుమారి,మరియు బొమ్మిడి విశాలాక్షి, కొప్పాడ మీనక్షి, పోలిశెట్టి నళిని,యెలుబండి సత్య, మోకా ఏడుకొండలు, బర్రె నాగరాజు, కొప్పాడ శ్రీనివాసరాజు, నర్సింహారాజు, దుర్గాప్రసాద్, పెమ్మాడి కిరణ్, నియోజకవర్గం జనసేనపార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు కాళీపట్నం వెస్ట్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.