జగన్ ప్రభుత్వంపై యుద్ధానికి మేము సిద్ధమే
కాకినాడ సిటి: జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలో 44వ డివిజన్ అధ్యక్షులు అగ్రహారపు సతీష్, డివిజన్ పెద్దలు ఇమ్మిడి శెట్టి రమణ, డివిజన్ ప్రధాన కార్యదర్శి గరగా శ్రీనివాసు ఆధ్వర్యంలో శారదా దేవి గుడి ప్రాంతం నందు గ్రీన్ టాక్స్ తో లారీ మరియు ఆటోలను చంపేస్తున్న జగన్ ప్రభుత్వంపై యుద్ధానికి మేము సిద్ధమే అనే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ శ్రేణులు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గ్రీన్ టాక్స్ మిగతా రాష్ట్రాలతో పోల్చినపుడు మనరాష్ట్రంలో ఎందుకు అంత ఎక్కువగా ఉన్నాయో తన సభలలో వివరించి చెప్పాలనీ, అందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధమా అని సవాలు చేసారు. సిద్ధం అనే పేరుతో అధికార దుర్వినియోగం చేస్తూ, ప్రజలకు బస్సులు లేకుండా తనసభలకు మళ్ళించుకుంటూ పీడిస్తూ, స్థానిక ప్రజలను ఆంక్షలతో నరకాన్ని చూపిస్తూ సభలను నిర్వహించడం తప్ప మరేమీ జగన్మోహన్ రెడ్డి సభలలో ప్రత్యేకత కనపడటంలేదన్నారు. తాను లేకపోతే నేడు ఇస్తున్న ప్రభుత్వ పధక ప్రయోజనాలు ఆగిపోతాయనీ అందుకే తనని నెగ్గించాలని ప్రజలను బెదిరిస్తున్న ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రీన్ టాక్స్ పేరుతో భారీగా దోపిడీ చేస్తూ లారీలు, ఆటోలపై పిండేస్తూ ఆ రంగాన్ని చంపేసాడనీ అందుకే నేడు ఈముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని వై.సి.పి ప్రభుత్వాన్నీ ఇంటికి పంపడానికి మేము సిద్ధం అని స్థానిక ప్రజలు అంటున్నారని, జనసేన తెలుగుదేశం బి.జె.పి పార్టీల కూటమికి రాబోయే ఎన్నికలలో మద్దతు ఇవ్వవలసినదిగా కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అట్ల సత్యన్నారాయణ, జిల్లా సమ్యుక్త కార్యదర్శి బడే క్రిష్ణ, సిటి ఉపాధ్యక్షుడు అడబాల సత్యన్నారాయణ, సుంకర రామకృష్ణ, రాయవరపు వెంకటేశ్వరరావు, తుమ్మలపల్లి సీతారాం, తుమ్మలపల్లి వీరభద్రరావు, డోలంక మురళి, అంకం రామానాయుడు, డేగల రవీంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-12-at-6.48.16-PM-1024x461.jpeg)