జనసేన-టీడీపీ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం

కాకినాడ రూరల్ మండలం, ఇంద్రపాలెం గ్రామం పిల్లి అనంత లక్ష్మి సత్యనారాయణ మూర్తి కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాకినాడ రూరల్ నియోజకవర్గం కో-ఆర్డినేటర్ పిల్లి అనంత లక్ష్మి సత్యనారాయణ మూర్తి అధ్యక్షతన జరిగిన టీడీపీ-జనసేన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని టీడీపీ-జనసేన శ్రేణులకు దిశా నిర్దేశంచేస్తూ, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు జనసేన-టీడీపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పంతం నానాజీ భరోసా కల్పించి వారిలో ధైర్యాన్ని నింపడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే శ్రీమతి పిల్లి అనంతలక్ష్మి, కో-ఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ, తెలుగుదేశం, జనసేన రాష్ట్ర, నాయకులు, జిల్లా, మండల, గ్రామస్థాయి నాయకులు, టీడీపీ కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.