ఇచ్చాపురం జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా పార్టీ అవిర్భవ దినోత్సవ వేడుకలు

ఇచ్చాపురం, జనసేన పార్టీ 11 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం ఇచ్ఛాపురం జనసేన పార్టీ కార్యాలయంలో నియోజక వర్గ ఇంఛార్జి దాసరి రాజు జనసేన జెండా ఆవిష్కరణ చేశారు.ఈ సందర్భంగా దాసరి రాజు మాట్లాడుతూ గత పదేళ్లుగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాల కోసం నిరంతరం పని చేస్తూ ఎటువంటి పదవులు ఆశించకుండా జనసైనికులు, వీర మహిళలు పార్టీ కోసం పని చేస్తూ పార్టీని ముందుకు తీసుకు వెళ్లడానికి కృషి చేశారని తెలిపారు. అలాగే రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్ధిగా ఎవరు పోటీ చేస్తున్నారు అనేది కాకుండా పోటీ చేసేది జనసేన అభ్యర్ధిగా భావించి పవన్ కళ్యాణ్ నిర్ణయానికి కట్టుబడి ప్రతీ ఒక్కరూ పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, వీర మహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.