చిలకలూరిపేట ఉమ్మడి పార్టీల సభను విజయవంతం చేయండి
గుంటూరు: చిలకలూరిపేటలో మార్చి 17న జరగబోయే జనసేన, బిజెపి, తెలుగుదేశం ఉమ్మడి పార్టీల భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని గురువారం ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు గారి అధ్యక్షతన గుంటూరులో రాష్ట్ర, జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పర్సన్స్, నగర అధ్యక్షులతో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర ప్రధానకార్యదర్శి బొనబోయిన శ్రీనివాస్ యాదవ్, వడ్రానం మార్కండేయులు, విజయ్ శేకర్, నగర అధ్యక్షులు నేరెళ్ళ సురేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల అధ్యక్షులు, నగర కార్యవర్గ సభ్యులు, వీరమహిలలు పాల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-14-at-7.21.20-PM-1-1024x445.jpeg)