జనసేన జెండా ఆవిష్కరించిన తిరుపతి సురేష్

విజయవాడ, జనసేన పార్టీ 11 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 42, 43 డివిజన్లో జనసేన పార్టీ జెండా ఆవిష్కరించిన జనసేన పార్టీ ప్రచార కమిటీ విజయవాడ అర్బన్ కో-ఆర్డినేటర్ తిరుపతి సురేష్, ఈ సందర్భంగా తిరుపతి సురేష్ మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన-టీడీపీ బీజేపీ పొత్తుతో పోతిన వెంకట మహేష్ గెలుపు నల్లేరు మీద నడకే అని ధీమా వ్యక్తం చేశారు. నేను కూడా నా శక్తికి మించి పని ఆయన గెలుపు భాగస్వామ్యం అవుతానని పశ్చిమ నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరటం ఖాయం అని మనస్ఫూర్తిగా భావిస్తున్న అన్నారు. ఈ కార్యక్రమంలో ఎండి ఆయాజ్, కానాల వినోద్ కుమార్, రెడ్డి ఆదిత్య రెడ్డి, సుమన్, మూర్తి రాజు, షాహిద్ తదితరులు పాల్గొన్నారు.