రైల్వే కోడూరు పట్టణ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

రైల్వే కోడూర్ నియోజకవర్గం, జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రైల్వే కోడూరు పట్టణ కార్యాలయం నందు ముత్యాల కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని జనసేన పార్టీ ముఖ్య నాయకులు మరియు సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని వారి సంతోషాన్ని పంచుకున్నారు. మరికొద్ది రోజుల్లో రానున్న ఎన్నికల్లో జనసేన-టీడీపీ ఉమ్మడి పొత్తుతో ఈ రాష్ట్రం ప్రతి నియోజకవర్గంలో ఊహించని విధంగా విజకేతనం ఎగరవెస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. అలాగే రైల్వే కోడూరులో జనసేన-టీడీపీ ఉమ్మడి కార్యాచరణతో అనూహ్య రీతిలో ఉమ్మడి అభ్యర్థిని అత్యధిక మెజారిటీ తో గెలిపించడానికి ఇప్పటికీ ప్రజలు నిర్ణయించుకున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రీజినల్ కో-ఆర్డినేటర్ కుప్పల జ్యోతి , అమర్నాథ్ అంకిశెట్టి మని, దళిత నాయకుడు నగిరి పాటి మహేష్ కనుపర్తి శంకరయ్య శివకుమార్ కె.వి నాగేంద్ర పల నాగేంద్ర గిరిధర్ ప్రభాకర్, విశ్వనాథ్, రమేష్ రెడ్డి, వంశీ తదితరులు పాల్గొన్నారు.