కోనాపురం గ్రామం నుంచి జనసేనలో 20 కుటుంబాల చేరిక

ఉరవకొండ, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలకు ఆకర్షితులై ఉరవకొండలోని కోనాపురం గ్రామానికి చెందిన 20కుటుంబాలు, పలువురు యువత జనసేన పార్టీలోకి చేరారు. సోమవారం ఉరవకొండ కేంద్రంలోని జనసేన కార్యాలయంలో ఇంచార్జి గౌతమ్ కుమార్ జనసేన కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా గౌతమ్ కుమార్ మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి క్రమశిక్షణతో అధినేత పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడవాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన-టిడిపి-బిజెపి ఉమ్మడి అభ్యర్థి విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని కోరారు. మీకు అన్నివేళలా తాను అందుబాటులో ఉంటూ అండగా నిలుస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చేరిన వారు ఏర్రిస్వామి, మారుతి, నందు, అక్కులప్ప, భారత్, లోకేష్, అశోక్, బ్రహ్మయ్య, నాయకులు మనికుమార్, వంశీ, కార్యకర్తలు పాల్గొన్నారు.