జనసేన-టీడీపీ-బీజేపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలి

మన్యం పార్వతీపురం జిల్లా, పాలకొండ నియోజకవర్గ జనసేన సమన్వయ కర్త నిమ్మల నిబ్రమ్ ఆదేశాల మేరకు భామిని మండల జనసేన నాయుకులు రుంకు కిరణ్ కుమార్ అధ్యక్షతన పార్టీ ఆఫీస్ లో కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన-టీడీపీ-బీజేపీ ఉమ్మడి అభ్యర్థిలో టికెట్ ఏ పార్టీకి ఇచ్చినా ఏ వ్యక్తికి ఇచ్చినా పొత్తు ధర్మం పాటించి అభ్యర్థి గెలుపు విషయంలో ఎవ్వరికి టికెట్ వచ్చినా గెలుపుకోసం ఏ విధంగా పనిచెయ్యాలి, ప్రజలలోకి వెళ్ళి అధినాయకుల నమ్మకాన్ని నిలబెట్టేవిధంగా నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకునే విధంగా మనం కలిసి గట్టుగా పని చెయ్యాలి అని భామిని మండలం జనసేన టీమ్ కి దిశా నిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనిల్, వైకుంఠ రావు , నాగరాజు, మిన్నరావు, మహేష్, ఈశ్వరరావు, హర్ష, జనసేన జానీ వివిధ గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.