పరిగిలో జనసేన చలివేంద్రం

పెనుగొండ నియోజకవర్గం, పరిగి మండలంలో జనసేన మండల నాయకుల ఆధ్వర్యంలో సేవమందిర్ సర్కిల్ లో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. లాయర్ శ్రీనివాస్ రెడ్డి అన్న చేతుల మీదుగా చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఎండాకాలం, పిల్లలకు టెన్త్ క్లాస్ పరీక్షలు, దూరప్రయాణం చేసే ప్రజలకు దాహం తీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శి మోద శివ నారాయణస్వామి, హనుమంతు, విష్ణు, నరేష్, శంకర్, గోపి, విజయ్ బాలు, మూర్తి, పాపన్న, రవి, జెబి, జనసెన నాయకులు, జనసైనికులు పాల్గొనడం జరిగింది.