పవన్ కళ్యాణ్ అనుమతి లేనిదే వార్డు అధ్యక్షులను మార్చడం కుదరదు!!

  • తిరుపతిలో జనసేన జెండా ఎగరేద్దాం..
  • ఈక్కడ జనసేనాని నిర్ణయించిన కమిటీనే కొనసాగుతుంది – జనసేన నేత కిరణ్ వెల్లడి..

తిరుపతి: రానున్న తిరుపతి అసెంబ్లీ ఎన్నికలలో వైసిపిని ఎదుర్కునే దిశగా పవన్ కళ్యాణ్ నిర్ణయించిన, తిరుపతిలోని వార్డు అధ్యక్షులను ఈ ఎన్నికలలో కొనసాగిస్తామని.. ఈ వార్డ్ కమిటీల మార్పు పంచాయతీ పుకార్లను ఎవ్వరూ నమ్మవద్దని, తమ జనసేనాని ఎంపిక చేసిన వార్డు అధ్యక్షులే కొనసాగుతారని స్పష్టం చేశారు. తిరుపతిలో జనసేన పార్టీ జెండాను ఎగరేసి తీరుతామని జనసేన తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్ పేర్కొన్నారు. తిరుపతి జనసేన వార్డు అధ్యక్షులతో మంగళవారం కిరణ్ రాయల్ నివాసంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో.. నగర అధ్యక్షుడు రాజారెడ్డి, బాబ్జి, హేమ కుమార్, మునస్వామి, రాజేష్ ఆచారి, రమేష్ నాయుడు, వినోద్, హిమవంత్, మనోజ్, కిషోర్, ఆది, హేమంత్ పురుషోత్తం, సాయి, సుబ్బు, పార్ధు, నవీన్, బాలాజీ, కొండ హరి ప్రసాద్, వంశీ, దుర్గ, చందన, పవన్, సుజిత్, కోమల్, రాజేష్, లోహిత్ బాషా లతో కలిసి వారు మాట్లాడుతూ.. తిరుపతి ప్రజలు జనసేన పార్టీకి అండగా ఉండారని కొనియాడారు. పవన్ కళ్యాణ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని, కూటమి పార్టీల వారిని కలుపుకొని జనసేన ను గెలిపించడమే మా ధ్యాయమని, అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల కొరకు వేచి చూస్తున్నామని వారు వ్యక్తం చేశారు.