ఆలయ నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్న అతికారి దినేష్

రాజంపేట, నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి పంచాయతీలో శబరిమల ప్రధానతంత్రి బ్రహ్మశ్రీ కుందరరు మహేష్ మొహనర్ ఆధ్వర్యంలో జరిగిన శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవాలయము నిర్మాణ శంఖుస్థాపన మహోత్సవంకు గ్రామస్థుల ఆహ్వనం మేర ఆలయ భూమిపూజ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన రాజంపేట జనసేన పార్టీ సమన్వయ కర్త అతికారి దినేష్ కి ఆలయ నిర్వాహుకులు సాదర స్వాగతం పలకడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ కమిటి సూచన మేర అతికారి దినేష్ ఆలయ నిర్మాణంలో తనవంతుగా సహాయం అందజేస్తానని, ఆయప్ప స్వామి భూమి పూజాకార్యక్రమంలో పాల్గొనడం చాలాసంతోషంగా ఉంది, అయ్యప్ప స్వామి ఆశీస్సులు మా నాయకుడు పవన్ కళ్యాణ్ పై ఎల్లప్పుడూ ఉండాలని, రాజంపేట నియోజకవర్గంలో పోత్తులో సీటు నాకు వచ్చే అవకాశం ఉంది, మీరు అందరు అండగా ఉండి భారీ మెజారిటీతో గెలిపించాలని, వైసిపి పాలనతో ప్రజలు విసిగిపోయారు అని, ఈసారి ఎన్నికలలో జనసేన-టిడిపి-బిజేపి కూటమి ఘనవిజయం సాధిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమాలు జనసేన నాయకులు కొట్టే శ్రీహరి, గుగ్గిళ్ళ వెంకటేశ్, శివ, రత్నం, వినయ్, హరి జనసైనికులు, గ్రామస్థులు పాల్గొన్నారు.