తెలుగుదేశం ఇన్చార్జ్ వర్మకి జనసైనికుల ఆధ్వర్యంలో ఘనసన్మానం

పిఠాపురం: ఎస్.వి. ఎస్.ఎన్.వర్మ పిఠాపురం నియోజకవర్గంలో పలు గ్రామాల నుండి టౌన్ నుండి జనసైనికులు ఎస్వీఎస్ఎన్ వర్మకి ఘన సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం జనసేన కలిపి మన అధినాయకుడు పవన్ కళ్యాణ్ ని లక్ష ఓట్లు మెజారిటీ గెలిపించుకోవాలని మనమందరం కష్టపడి పని చేయాలని కోరారు. పవన్ కళ్యాణ్ ని మీరు ముందుండి నడిపించాలని జనసైనికులు వర్మని కోరడం జరిగింది. వర్మ కూడా మనః పూర్వకముగా గెలిపించుకుందామని తెలియజేయటంతో జనసైనికులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.