ఎరగుంటపల్లి గ్రామంలో పర్యటించిన జేసి

తాడిపత్రి: బాబు స్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ టీడీపీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు (21-03-2024) ఉదయం ఏటిగడ్డపాలెం, సాయంత్రం తాడిపత్రి మండలం, ఎరగుంట పల్లి గ్రామం నందు తాడిపత్రి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ జెసి అష్మిత్ రెడ్డి గారు పర్యటించి ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకుని సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకర్గ ఇంచార్జీ కదిరి శ్రీకాంత్ రెడ్డి సూచనలతో పట్టణ అధ్యక్షుడు కుందుర్తి నరసింహా చారి, ఉపాధ్యక్షుడు గోపాల్ మరియు తాడిపత్రి మండల టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, జెసి అనుచరులు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.