బుచ్చింపేటలో జనం కోసం జనసేన మహాపాదయాత్ర

రాజానగరం, జనసేన-తెలుగుదేశం-బిజెపి బలపరచిన ఉమ్మడి అభ్యర్ధి బత్తుల బలరామకృష్ణ తరపున వారి కుటుంబ సభ్యులు బుచ్చింపేట గ్రామంలో గురువారం జనం కోసం జనసేన మహాపాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు తీన్మార్ డప్పులతో, పూల వర్షం కురిపిస్తూ ఆడపడుచులు హారతులు పడుతూ అఖండ స్వాగతం పలికడం జరిగింది. రానున్న ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా జనసేన పార్టీ ఆశయాలు సిద్దాంతాలు ప్రజలకు చేరువచేస్తూ కోరుకొండ మండలం, బుచ్చింపేట గ్రామంలో ప్రతీ ఇంటికీ తిరుగుతూ ప్రతీ ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజా పరిపాలన తీసుకురావడానికి మన ఆశలకు, ఆకాంక్షలకు వారధి రాజానగరం నియోజకవర్గం అభివృద్ధి చెందడానికి జనసేన-తెలుగుదేశం-బిజెపి పార్టీలు బలపరచిన ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణని అఖండ మెజారిటీతో గెలిపించండి అని జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి, జనసేన పార్టీ వీరమహిళా కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి తోట ప్రత్యూషాదేవి, వందనాంబిక అభ్యర్థించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన-తెలుగుదేశం-బిజెపి పార్టీ నాయకులు, జనసైనికులు, కార్యకర్తలు, వీరమహిళలు, గ్రామ ప్రజలు భారీగా పాల్గొన్నారు.