భూపాలపల్లిలో భగత్ సింగ్ కు ఘనంగా నివాళులు

భూపాలపల్లి, దేశ స్వాతంత్య్రం కోసం ఉరికంభం ఎక్కిన భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా భూపాలపల్లిలోని వారి విగ్రహానికి భూపాలపల్లి జనసేన నాయకులు పూలమాల వేసి స్మరించుకోవడం జరిగింది. వారితో పాటు రాజ్ గురు, సుఖ్ దేవ్ కూడా ఉరి తీయబడ్డారు. వారి సేవలు అనిర్వచనీయం. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా నాయకులు జేరిపోతుల సనత్ కుమార్, తెలంగాణ ఎమ్మార్పిఎస్ నియోజకవర్గ ఇంచార్జి శీలపాక హరీష్, ఎన్.హెచ్.ఆర్.సి భూపాలపల్లి జిల్లా సంయుక్త కార్యదర్శి శీలపాక నరేష్, తాటికొండ రమేష్, అంబాల రాజారామ్ తదితరులు పాల్గొన్నారు.