రైతులకు పంట నష్టపరిహారం చెల్లించాలి: విసినిగిరి శ్రీనివాసరావు

చీపురుపల్లి నియోజకవర్గంలో ఇటీవల ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం కారణంగా పత్తికాయవలస గ్రామంలో మీసాల సిమ్మి నాయుడు మూడు ఎకరాల అరటి తోట పంట చేతికి వచ్చే సమయానికి నేల కొరిగి పూర్తిగా ధ్వంసం అయింది, అలాగే కూనిబిల్లి గొల్ల కి సంబంధించి మొక్కజొన్న పంట పూర్తిగా నేలకొరిగింది. అలాగే ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం కారణంగా నియోజకవర్గంలో రైతులు అందరూ తమ పంటలు నేలకొరిగి తీవ్రంగా నష్టపోయారు. వారందరికీ కూడా ప్రభుత్వం తరుపున నష్టపరిహారం చెల్లించాలని జనసేన పార్టీ తరఫున చీపురుపల్లి జనసేన పార్టీ ఇంచార్జ్ విసినిగిరి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. పత్తికాయవలస వెళ్లి రైతుల పంట పొలాలను పరిశీలించి సంబంధిత హార్టికల్చర్ అగ్రికల్చర్ అధికారులకు తెలియచేశారు. పంట నష్ట పోయిన రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మీసాల హరికృష్ణ, జనసేన నాయకులు శంకర్, బాలి ప్రకాష్, వండాన భానుమూర్తి, బైరెడ్డి రామారావు తదితరులు పాల్గొన్నారు.