ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న రోడ్డు నిర్మిస్తాం: వాకర్స్ సభ్యులకు బొలిశెట్టి హామీ

తాడేపల్లిగూడెం, గణేష్ నగర్ నుంచి గ్రౌండ్ మీదుగా కొండ్రుపోలు వెళ్లే రోడ్డు తాము అధికారంలోకి వచ్చిన ఆరు నెలలలోపే నిర్మిస్తామని ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. తాడేపల్లిగూడెం వాకర్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశంలో బొలిశెట్టి శ్రీనివాస్ మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాకర్స్ సభ్యులు బొలిశెట్టికి శాలువా పూల దండలతో ఘన సత్కారం చేశారు. ఈ సందర్భంగా బొలిశెట్టి మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ఐదేళ్లు పాలనలో అభివృద్ధి గాలికి వదిలి ప్రజలను దోచుకున్నారన్నారు. ఒక రూపాయి ఏరచూపి పది రూపాయలు పన్నుల రూపంలో నిత్యవసర సరుకుల రూపంలో దోచిన జగన్ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు అన్ని వర్గాల వారు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. నిన్నటిదాకా సిద్ధం అంటూ కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన జగన్, మేమంతా సిద్ధం బస్సు యాత్ర పేరుతో ప్రజలను మరోసారి ఏమార్చేందుకు ప్రయత్నిస్తున్నారనీ కొనియాడాలు. ఈ కార్యక్రమంలో వాకర్స్ సభ్యులు నాయకులు, జనసేన-టిడిపి-బిజెపి నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు.