జనసేన-టిడిపి-బిజేపి ఆత్మీయ సమావేశం

మదనపల్లి నియోజకవర్గంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగిన జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీల ఆత్మీయ సమావేశంలో జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి మరియు జనసేన నాయకులు కార్యకర్తలు మరియు వీర మహిళలు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ఏ అభివృద్ధి నోచుకోలేదని చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పనులు, మదనపల్లిని జిల్లాగా ప్రకటించలేదని వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలిపించుకొని మదనపల్లిని అభివృద్ధి చేసుకొందాం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, తాళ్ల గిరి, జిల్లా జాయింట్ సెక్రటరీ సనా ఉల్లా, గజ్జల రెడ్డెప్ప, రూరల్ మండలం అధ్యక్షులు గ్రానైట్ బాబు, రామసముద్రం మండలం అధ్యక్షులు చంద్రశేఖర్, పట్టణ ప్రధాన కార్యదర్శి కావలి రెడ్డెమ్మ, నిమ్మనపల్లి మండలం అధ్యక్షులు ప్రదీప్ సింగ్, జనసేన సీనియర్ నాయకులు తోట కళ్యాణ్, అఫ్రోజ్ ఖాన్, రూరల్ ఉపాధ్యక్షులు చంద్రశేఖర్, ఐటీ విభాగ నాయకులు కల్లూరు లక్ష్మినారాయణ, రామసముద్రం మండలం ఉపాధ్యక్షులు, రూరల్ ఉపాధ్యక్షులు చంద్రశేఖర, క్రాంతి బంగారం, రూరల్ ప్రధాన కార్యదర్శి పవన్ శంకర, రాజారెడ్డి, లవన్న, విజయ్ కుమార్, గంగులప్ప, రూరల్ ప్రధాన కార్యదర్శి జంగాల గౌతమ్, జయ, రూరల్ సెక్రటరీ జనర్దన్, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.