నందికొట్కూరు నియోజకవర్గంలో జనసేన పార్టీలో చేరికలు

నందికొట్కూరు నియోజకవర్గంలోని మిడుతూరు మండలంలో గల దేవనూరు గ్రామానికి చెందిన గ్రామస్తులు, యువకులు మా మొదటి ఓటు జనసేన పార్టీకే అని నందికొట్కూరు పట్టణంలో గల జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చి నియోజకవర్గ జనసేన తెలుగుదేశం పార్టీ సమన్వయ సభ్యులు నల్లమల రవికుమార్ చేతుల మీదుగా జనసేన పార్టీ కండువా కప్పుకొని పార్టీ సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నల్లమల రవికుమార్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం గడిచిన కాలంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని, ప్రస్తుతం ఎన్నికలు రావడంతో మళ్లీ గెలవడానికి జిత్తుల మారి నక్కలా ప్రవర్తిస్తుందన్నారు. పెన్షన్లు ఇవ్వలేక పొత్తులో భాగమైనటువంటి పార్టీలపై అబాండాలు మోపుతుందన్నారు. జనసేన పార్టీని ఎంత తొక్కలనుకుంటే అంత బలంగా తయారవుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుడిపాడు ప్రభాకర్ మాట్లాడుతూ దేవనూరు గ్రామస్తులకు గుడిపాడు గ్రామస్తులకు జనసేన పార్టీ తరఫున ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవనూరు గ్రామానికి చెందినటువంటి శరత్, మనీ, వెంకటేష్, మహేష్, పవన్, అరవింద్, మౌలాలి, వంశీ తదితరులు పార్టీ కండువా కప్పుకొన్నారు.