సుగవాసిని కలిసిన జనసేన చేనేత వికాస కార్యదర్శి
- శాలువాతో సత్కరించే శుభాకాంక్షలు తెలిపిన రాటాల రామయ్య
రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం: అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యంను బుధవారం జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. రాజంపేట నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించారు. వచ్చే ఎన్నికల్లో రాజంపేటలో కూటమిలో భాగంగా విజయం సాధిస్తుందన్నారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యంను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నేత భాస్కర పంతులు, జనసేన యువ నాయకుడు పోలిశెట్టి శ్రీనివాసులు, మండూరు గోపి, కొత్తూరు వీరయ్య ఆచారి, కిషోర్, గోవర్ధన్, వీరబల్లి నాయకులు జయరామయ్య తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-03-at-8.03.42-PM-1024x681.jpeg)