ఎన్నికల నియామవళి అవగాహన సదస్సు
సత్తెనపల్లి రూరల్: బుధవారం సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని అబ్బూరు, రెంటపాళ్ళ, భట్లురు, కందులవారిపాలెం గ్రామల్లో రానున్న ఎన్నికల దృష్ట్యా ఓటర్ల లిస్టును, స్థానిక నాయకులతో కలిసి అవగాహన కల్పించి, ఓటర్ లిస్టులను గ్రామస్తులకు అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో సత్తనపల్లి రూరల్ మండల అధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరరావు, దార్ల లక్ష్మయ్య మండల ప్రధాన కార్యదర్శి పెద్దింటి నాగరాజు, దార్ల శ్రీనివాసరావు, దార్ల నాగరాజు, దార్ల శ్రీనివాసరావు, పెద్దింటి రాంబాబు, దార్ల బాజీ, గండికోట నాయుడు, పెద్దినేని వెంకటేశ్వరరావు, ఏడవ వార్డు కౌన్సిలర్ రంగిశెట్టి సుమన్, కడియం అంకమ్మరావు, బుజ్జ రామకృష్ణ, స్థానిక గ్రామస్తులు ఉన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-03-at-9.21.53-PM-1024x768.jpeg)