చిలకలూరిపేట జనసేనలో చేరికలు
చిలకలూరిపేట నియోజకవర్గం, జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తోట రాజా రమేష్ ఆధ్వర్యంలో గుంటూరు జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు సమక్షంలో నాగ వీరాంజనేయులు 20 మంది గురువారం జనసేన పార్టీలో చేరటం జరిగింది. వారిని గాదె వెంకటేశ్వరరావు పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించడం జరిగింది. గతంలో వీరు అధికార పార్టీ వైసిపి నాయకులుగా వ్యవహరించినవారు. నూతనంగా పార్టీలోకి పలవర్టి సాల్మన్ రాజు, ముత్యాల చిరంజీవి, కుప్పల మణికంఠ, ముత్యాల రామాంజనేయులు, కాసా పవన్ కళ్యాణ్, పొలం చంద్రశేఖర్, రాజు తదితరులు చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి షేక్ సుభాని, పట్టణ నాయకులు షేక్ మునీర్ హసన్, ఆముదాల లీలా కిషోర్, కోట సాంబ, తదితరులు పాల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-04-at-9.10.54-PM-1024x461.jpeg)