నిడదవోలులో జనసేన ప్రచారం

నిడదవోలు నియోజకవర్గం, నిడదవోలు రూరల్ మండలం, కోరుమామిడి గ్రామంలో జనసేన-తెలుగుదేశం-భారతీయ జనతా పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్ తనయుడు డా.కృష్ణ తేజ ఇంటింట ప్రచారంలో పాల్గొని ఆడపడుచులను, అన్న-దమ్ములను, అవ్వ-తాతలను ఆప్యాయంగా పలకరిస్తూ ఉమ్మడి పార్టీల యొక్క మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ, ఎమ్మెల్యే అభ్యర్థి అయిన కందుల దుర్గేష్ కి గాజుగ్లాసు గుర్తుపై, పార్లమెంటు అభ్యర్థి అయిన దగ్గుపాటి పురందేశ్వరికి కమలం గుర్తుపై ఓటు వేయవలసిందిగా అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.