అరకు పార్లమెంటరీ ఆత్మీయ సమావేశం
విశాఖపట్నం ఒక ప్రైవేట్ హోటల్లో బీజేపీ-టీడీపీ-జనసేన ఉమ్మడి ఎంపీ అభ్యర్థి శ్రీమతి వంగపల్లి గీత ఆధ్వర్యంలో 7 నియోజకవర్గాలు అరకు, పాడేరు, కురుపాం, పాలకొండ, పార్వతీపురం, రంపచోడవరం, సాలూరు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థులు మరియు ముఖ్య నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించి ప్రచార కార్యక్రమాల నిర్వహణ, ప్రజలో పార్టీ, అభ్యర్థి గుర్తుల సూచన, పార్టీలతో సమన్వయం వంటి అంశాల మీద దిశానిర్దేశం చేశారు. మరియు ఎమ్మెల్యే అభ్యర్థుల, ముఖ్య నేతల సలహాలు సూచనలు కూడా పరిశీలించి గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రచార కమిటీ- ఉమ్మడి విజయనగరం జిల్లా కో-ఆర్డినేటర్ కోట్ల కృష్ణ, పార్వతీపురం సమన్వయకర్త ఆదాడ మోహన్, కురుపాం నియోజకవర్గ సమన్వయకర్త కండ్రిక మల్లేష్, పార్వతిపురం నియోజకవర్గ సీనియర్ జనసేన నాయకులు చందక అనిల్, రెడ్డి కరుణ, నేయ్యిగాపుల సురేష్, సిరిపురపు గౌరీ, రేవళ్ళ దుర్గ ప్రసాద్, కొమరాడ మండల అధ్యక్షులు తెంటూ శ్రీకర్, కురుపాం నియోజకవర్గ సీనియర్ నాయకులు తాడేల శ్రీరాములు నాయుడు, రుత్తుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-05-at-21.38.48-1024x768.jpeg)