మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆదర్శనీయుడు: దేవ వరప్రసాద్

రాజోలు: మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆదర్శనీయుడని టీడీపి, జనసేన, బిజెపి పార్టీల ఉమ్మడి అభ్యర్థి దేవ వరప్రసాద్ అన్నారు. రాజోలులో ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీల ఆధ్వర్యంలో జరిగిన జ్యోతిరావు పూలె 197వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా దేవ వరప్రసాద్ మాట్లాడుతూ అంటరానితనాన్ని నిర్మూలించి సమసమాజ స్థాపన కొరకు కృషి చేసిన మహా నాయకుడు పూలె అని అన్నారు. స్త్రీ జాతి ఉద్దరణ కోసం కృషి చేసి ప్రతీ స్త్రీ చదువుకోవాలని తన భార్య సావిత్రి బాయ్ పూలె కు విద్యను విద్యను నేర్పి ఆమెను ఉపాధ్యాయురాలుగా మార్చి మహిళలందరిని విద్యావంతులుగా తయారు చేసిన గొప్ప వ్యక్తి పూలె అని ఆయన బడుగు బలహీన వర్గాలకు ఆరాధ్య దైవం అని దేవ వరప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.