బొజ్జల సుధీర్ రెడ్డి ఎన్నికల ప్రచారం

శ్రీకాళహస్తి, జనసేన పార్టీ ఏర్పేడు మండలం కమిటీ కార్యాచరణలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన-టిడిపి-బిజెపి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి గెలుపు కోసం మాదవమాల పంచాయతీ పరిధిలోని గుండ్రాలమిట్ట, సుండి, మాదవమాల గ్రామాల్లో ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏర్పేడు మండల అధ్యక్షులు కిరణ్ రామిశెట్టి, జనసేన నాయకులు రవి కుమార్, శివ శంకర్, ముని కుమార్, దశరథ, గురు ప్రసాద్, కన్నయ్య, సురేష్, భాను ప్రకాష్, బాలు, రాధాకృష్ణ, జనసైనికులు పాల్గొన్నారు.