ప్రచారంలో దూసుకుపోతున్న దేవ

రాజోలు మండలం, మలికిపల్లి గ్రామంలో అనుచూరి పురుషోత్తం నివాసం వద్ద జనసేన-తెలుగుదేశం-బిజెపి పార్టీలు బలపరిచిన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దేవ వరప్రసాద్ మరియు అమలాపురం పార్లమెంటరీ ఎంపి అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా టీడీపి మండల అధ్యక్షులు గుబ్బల శ్రీనివాస్ ఉల్లంపర్తి దర్శనం, బీజేపీ మండల అద్యక్షులు, జనసేన, టీడీపి, బీజేపీ గ్రామ శాఖ అద్యక్షులు అధ్వర్యంలో ముఖ్య నాయకులతో, కార్యకర్తలతో మాట్లాడుతూ ములికిపల్లి గ్రామంలో ఇంటి ఇంటికీ ఎన్నికల ప్రచారంలో ప్రజా సమస్యలు ఆధునీకరణ పనులు గురించి, బీసీ డిక్లరేషన్ గురించి, బీసీ కమ్యూనిటీ హాల్ లు, బుడగ జంగాల సంఘ సమస్యలు, డ్రైనేజ్ సమస్య, కరెంటు సమస్య, తదితర సమస్యలు తెలుసుకుని. మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సమస్యలు తప్పనిసరిగా పరిష్కరిస్తామని హామీ ఇస్తూ ఎమ్మెల్యే అభ్యర్దికి గాజు గ్లాసు ఎంపీ అభ్యర్ధికి సైకిల్ గుర్తుపై తమ అమూల్య మైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో జనసేన-తెలుగుదేశం-భారతీయ జనతా పార్టీల రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దిరిశాల బాలాజి, రాపాక రమేష్ బాబు, పినిశెట్టి బుజ్జి, సాయిబాబా రాజు, కాకి లక్ష్మణ్, చాగంటి స్వామి, ముప్పార్తి నాని, తాడి సత్యనారయణ, గెడ్డం సింహ, మోకా పార్వతి, రావూరి నాగు, ఉండపల్లి అంజి, గంటా నాయుడు, కుక్కల భేబి,బొనం చంటి, జిల్లా మండల గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.