అనంతపురం జిల్లాలో నియోజకవర్గ పర్యటనలు ప్రారంభించిన చిలకం మధుసూదన్ రెడ్డి

కళ్యాణదుర్గం: ఉమ్మడి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబుని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు చిలకం మధుసూదన రెడ్డి కలిసి వారికి అభినందనలు తెలియజేసి, తప్పకుండా మీ విజయానికి కృషి చేస్తామని ఆయనకి భరోసా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జనసేన పార్టీ మండల కన్వీనర్లతో మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలతో మీటింగ్ ఏర్పాటు చేసుకొని, మిత్రపక్ష అభ్యర్థిని ఏ విధంగా గెలిపించుకోవాలి అనే విషయాలపై చర్చించి, వారికి దిశా నిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాప్తాడు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పవన్ కుమార్, కళ్యాణదుర్గం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బాల్యం రాజేష్, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శులు లక్ష్మీ నరసయ్య, మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, మండల కమిటీ సభ్యులు, నాయకులు, వీరమహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.