అంబేడ్కర్ జయంతి ఉత్సవాలలో పాల్గొన్న బత్తుల

రాజానగరం: దళిత, బహుజన వర్గాల ఆశాజ్యోతి, న్యాయకోవిదులు, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న “డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్” గారి జయంతి సందర్భంగా కోరుకొండ మండలం గాడాల గ్రామంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ జయంతి ఉత్సవాలలో పాల్గొని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన రాజానగరం నియోజకవర్గం జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.