విజయవాడ సెంట్రల్ లో అంబేద్కర్ జయంతి వేడుకలు

విజయవాడ సెంట్రల్: భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 27వ డివిజన్ లో గల అంబేద్కర్ విగ్రహానికి డివిజన్ అధ్యక్షులు దాసరి నాగరాజు ఆధ్వర్యంలో నివాళి కార్యక్రమం అనంతరం పాదచారులకు మజ్జిగ, పండ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు ఉన్నూరు అనురుద్రుడు, జనసేన కృష్ణ పెన్న కమిటీ సభ్యులు శ్రీమతి రావి సౌజన్య, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయ కర్త బొలిశెట్టి వంశీ, 36వ డివిజన్ అధ్యక్షులు యాంపాటి ప్రభూజి, పసుపులేటి విజయలక్ష్మి ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు పగిడిపల్లి. గిరీష్, ఉన్నూరు క్రాంతి, బండారు వంశీ, రాజనాల శ్రీను, గోపి, చందు, ఉన్నురు బ్రదర్స్ మరియు జనసైనికులు పాల్గొని విజయవంతం చేసారు.