రాజ్యాంగ పరిరక్షణకై సమిష్టిగా కృషి చేద్దాం – గాదె పృథ్వి

స్టేషన్ ఘనపూర్: రాజ్యాంగ పరిరక్షణ ప్రతి పౌరుడు బాధ్యతగా తీసుకోవాలని జనసేనపార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ గాదె పృథ్వి అన్నారు. ఆదివారం అంబేద్కర్ జయంతి సందర్బంగా నియోజకవర్గ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పార్టీ శ్రేణులతో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచం గర్వించదగ్గ మేధావి అన్నారు. బడుగుబలహీన వర్గాల అభ్యున్నతికై, నిమ్నజాతి హక్కులకై నిరంతరం పోరాడిన మహనీయులని పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాణంలో ఎన్నో ఎదురుదెబ్బలు ఆటంకాలు ఎదురైనా భారత ప్రజల హక్కులకై అంబేద్కర్ కృషి చేసారని గుర్తుచేశారు. రాజ్యాంగ పరిరక్షణకై అన్నివర్గాలు సమిష్టిగా పోరాడి అంబేద్కర్ ఆశయాల సాధనకై కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో జనసైనికులు మహమ్మద్ రజాక్, మునిగాల పవన్, అక్కేనపల్లి సాయి, ప్రశాంత్, గ్యార బన్నీ, నితీష్ తదితరులు పాల్గొన్నారు.