మైలవరం జనసేన ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

మైలవరం: జనసేన పార్టీ ఆధ్వర్యంలో మైలవరం మెయిన్ రోడ్ లో గల అంబేద్కర్ మరియు బాబు జగజ్జివన్ రావు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కృషిని, రాజ్యాంగాన్ని రచించడంలో ఆయన పాత్రను కొనియాడారు. నేటి యువతకు ఆయన జీవితం మార్గదర్శమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణాజిల్లా ప్రోగ్రాం కమిటీ మెంబర్ పురమ సతీష్, జనసేనపార్టీ మైలవరం మండల అధ్యక్షులు శీలం బ్రహ్మయ్య, ఉపాధ్యక్షులు పడిగెల ఉదయ్, మండల నాయకులు ఆకుతోట ఈశ్వర్, చంద్రాల మురళీకృష్ణ, టౌన్ ఉపాధ్యక్షులు రవితేజ, నాయకులు తోట మాధవరావు, ఈత కొట్టు నాని, మాదినేని చిన్న రామారావు, నాగులూరి నారాయణరావు, శివరాం ప్రసాద్, చలకంటి వెంకయ్య, దద్దనాల సత్యనారాయణ, మర్రి కొండలరావు, సాయి, ఆనం నవీన్, ఆనం గోపాలరావు, లేళ్ల జగదీష్, పుచ్చకాయల చైతన్య, శ్రీకాంత్, ఆకుతోట వెంకటేశ్వరరావు, తోట మురళి, వసంతరావు తదితరులు పాల్గొన్నారు.