వైసిపి ఎన్నికల స్వార్థానికి, వాలంటీర్లను బలితీసుకుంటున్నారు!

  • జిల్లా ఎన్నికల యంత్రాంగం ఏం చేస్తుంది?
  • జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు

బొబ్బిలి: వైసిపి వారికి అంత దురదగా ఉంటే.. ముందు వైసిపి కౌన్సిలర్లు, వివిధ అధికార హోదాల్లో ఉన్న వైసిపి ప్రతినిధులు రాజీనామా చేసాక తర్వాత వాలంటీర్ల జోలికి రండి. వాలంటీర్లకు ఇష్టం లేకపోయినా, వైసిపి కూలీలుగా వాడుకోవడానికి చూస్తున్నారు. వైసిపి ఎలాగో ఓడిపోతుందని, తమతో పాటు వాలంటీర్ల భవిష్యత్తును కూడా నాశనం చెయ్యాలని చూస్తున్నారు. న్యాయబద్ధంగా పని చేసిన ప్రతీ వాలంటీర్ భవితవ్యానికి తెలుగుదేశం, జనసేన, బిజేపి ప్రభుత్వం హామీ ఉంటుంది. మన ప్రభుత్వంలో జీతం 10,000 కు పెంపు ఖచ్చితంగా జరుగుతుంది. వైసీపి నాయకుల చేతిలో మానసిక చిత్రహింసలకు గురౌతున్న వాలంటీర్లకు విజయనగరం మరియు మన్యం జిల్లా కలెక్టర్లు మరియు ఎన్నికల యంత్రాంగం భరోసాగా నిలవాలని డిమాండ్ చేస్తున్నాం. వాలంటీర్ల నిర్వహణ సంస్థ, ఎఫ్.ఓ.ఏ యంత్రాంగాన్ని తక్షణమే ఎలక్షన్ కమీషన్ అధీనంలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని బాబు పాలూరు పేర్కొన్నారు.