ఎన్.డి.ఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి- శ్రీమతి వినుత కోటా

శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా ఈరోజు తొట్టంబేడు మండలం, పెద్ద సింగమల, గురుకులపాలెం, గాబచేను, కొమ్మనుగుంట గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్థానానికి సైకిల్ గుర్తుకి ఓటు వేసే గెలిపించాలని, పార్లమెంట్ స్థానానికి కమలం గుర్తుకి ఓటు వేసే గెలిపించాలని ప్రజలను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ-జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరుతున్నాము. ఉమ్మడి ప్రభుత్వం లో ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని ప్రజలకి హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు పేట చంద్ర శేఖర్, నాయకులు తేజ, శీను, టీడీపీ నాయకులు విజయ్ కుమార్, గోవర్ధన్ నాయుడు గుర్రప్ప, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.