గుండాలమ్మ పంచాయతీ నుండి జనసేన పార్టీలో చేరికలు

కోవూరు నియోజకవర్గం, కొడవలూరు మండలం, గుండాలమ్మ పాలెం పంచాయితీ పరిధిలో, నెల్లూరుజిల్లా జనసేన పార్టీ ఐటి కోఆర్డినేటర్ నక్కల శివకృష్ణ, కొడవలూరు మండల అధ్యక్షుడు చక్కా సూలం బాబు నాయకత్వంలో, బెల్లంకొండ సునీల్ కుమార్, రామిశెట్టి శ్రీకాంత్
పెడబోడి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో గుండాలమ్మ పంచాయతీ నుండి 100 మంది యువకులు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఆశయాలు మెచ్చి ఆదివారం జనసేన పార్టీ కండువు కప్పుకొని పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో విడవలూరు మండల అధ్యక్షులు కమతం శ్రీనాథ్ యాదవ్ కూడా పాల్గొన్నారు.