నాగిరెడ్డిపల్లెలో ఎన్డీఏ కూటమి ప్రచారం

రాజంపేట: జనసేన పార్టీ రాజంపేట పార్లమెంటు సమన్వయకర్త యల్లటూరు శ్రీనివాస రాజు సూచన మేరకు బుధవారం ఉమ్మడి కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలం నాగిరెడ్డిపల్లె లో జనసేన, బిజెపి, టిడిపి కూటమి ప్రచారంలో నాయకులు ఓటర్లకు మేనిఫెస్టో ను వివరించారు. రాబోయే ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేసి రాజంపేట పార్లమెంటు అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని మరియు సైకిల్ గుర్తుకు ఓటు వేసి రాజంపేట అసెంబ్లీ అభ్యర్థి సుగవాసి బాలసుబ్రమణ్యం గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి ఇప్పుడు ఉన్న ఈ రాక్షస ప్రభుత్వాన్ని సాగనంపాలని పిలుపునిచ్చిన నాయకులు. ఈ కార్యక్రమంలో సుగవాసి సుధాకర్, మాజీ జెడ్పీటీసి యల్లటూరు శివరామరాజు, మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్, మాడపూరి హేమలత, లక్ష్మీ నరసయ్య, సర్పంచ్ నరసయ్య, డాక్టర్ అరిగె రామ్ ప్రసాద్ ఆకుల చలపతి, తోట శివశంకర్, సమ్మెట ఉమామహేష్, రాచయ్య, సాయిరాజు, తిప్పాయపల్లె ప్రశాంత్, రాచూరి మురళి, పులి నరసింహులు, జాకేటి రమణ, వేణు, ప్యారు, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.