చామకూరిపాలెంలో వైసీపీ నుండి జనసేన పార్టీలో చేరికలు

నరసాపురం నియోజకవర్గం: చామకూరిపాలెం గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తలు కవురు ఏసు, మల్లుల శ్రీను, మల్లుల ప్రసాద్, మల్లుల బద్రి, మల్లుల చిన్ని, దొంగ వెంకీ, మల్లుల పల్లపరాజు, కోడి కుమారస్వామి, గుబ్బల నాగరాజు, మల్లుల మురళీ మరియు దాదాపుగా 50 మంది చామకూరి రమేష్, గుబ్బల వంశీ, మల్లుల వెంకట్ మరియు గుబ్బల మార్రాజు ల ఆధ్వర్యంలో, టీడీపీ, బీజేపీ పార్టీలు బలపరిచిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్ సమక్షంలో వైసీపీ నుండి జనసేన పార్టీలో చేరారు. వారందరికీ నాయకర్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.