ధూళిపాళ్ళలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బొర్రా

సత్తెనపల్లి నియోజకవర్గం: ధూళిపాళ్ళ గ్రామం, భాగ్య నగర్ కాలనీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బొర్రా వెంకట అప్పారావు మరియు ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు చెల్లెలు రుద్రమదేవి. కార్యక్రమంలో భాగంగా సూపర్ సిక్స్ పథకాలని వివరిస్తూ జనసేన, బిజెపి, తెలుగుదేశం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ గారిని గెలిపించాలని మరియు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మండల గ్రామ నాయకులు జనసేన మరియు బిజెపి, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.