మైలవరం జనసేన పార్టీలోకి చేరికలు

మైలవరం స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ రాష్ట్రఅధికార ప్రతినిధి మరియు మైలవరం నియోజకవర్గ ఇన్చార్జ్ అక్కల గాంధీ ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షులు శీలం బ్రహ్మయ్య సమక్షంలో జనసేన పార్టీలోకి జాయిన్ అయిన మైలవరం గ్రామపంచాయతీ 12వ వార్డు మెంబరు ముద్దర నాగ వెంకట చిట్టిబాబు మరియు కుంటముక్కల సాయి, పసుపులేటి వెంకటేశ్వర రావు, తుమ్మలపల్లి ప్రభాకర రావు, ముత్యాల జమలయ్య, అంగిరేకుల గోపాలరావు, షేక్ బహదూర్, నాగబాబు వైసీపీని వీడి జనసేన పార్టీలోకి రావడం జరిగింది. కండువాలు కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించిన అక్కల గాంధీ. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ పార్టీలో కష్టించి పనిచేయాలని కూటమి అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించే దిశగా పనిచేయాలని పిలుపునిచ్చారు. నూతనంగా పార్టీలో జాయిన్ అయిన వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ ఉమ్మడి కృష్ణాజిల్లా ఉపాధ్యక్షులు బొలియాశెట్టి శ్రీకాంత్, జిల్లా ప్రోగ్రాం కమిటీ మెంబర్ పురమ సతీష్, రెడ్డిగూడెం-జి.కొండూరు మండల అధ్యక్షులు చాపల మడుగు కాంతారావు, ఎర్రబోలు నరసింహారావు, ఉపాధ్యక్షులు పాములపాటి సుందర్ రామిరెడ్డి, మండల నాయకులు, గ్రామఅధ్యక్షులు, జనసైనికులు పాల్గొన్నారు.