అన్నదాతలకు అన్నపానీయసదుపాయం కల్పించడం మా దంపతుల అదృష్టం

  • చైర్మన్ జ్యోతుల శ్రీనివాసు గంగా భవానీ

పిఠాపురం నియోజవర్గం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి సేవ స్ఫూర్తితో, జిల్లా జనసేన అధ్యక్షులు కందుల దుర్గేశ్ చేతులపై ప్రారంభోత్సవం చేయబడి, సాయిప్రియసేవాసమితి చైర్మన్ జ్యోతుల గంగభవానీశ్రీనివాసు ఏర్పాటుచేస్తున్న శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నపానీయ సదుపాయ కేంద్రం నందు ప్రతి శనివారం పిఠాపురం పశువుల సంత వద్ద రైతులకు గత 54వ వారాలుగా అన్నపానీయ సదుపాయమును కల్పించుచున్నారు. 55వ వారం అయిన ఈ శనివారం రైతులకు, పశువుల బేరాల మధ్యవర్తులకు, వివిధ హాస్పటల్ కి వచ్చిన ఔట్ పేషెంట్లకు కలిపి 500 మందికి అన్నపానీయంసదుపాయమును కల్పించారు. వడ్డన కార్యక్రమంలో స్వచ్ఛందంగా పిఠాపురం నగరజనసేన నాయకులు అల్లంకిషోర్, దుర్గాడ గ్రామానికి చెందిన జ్యోతుల నాని, విప్పర్తి కృపాకర్, సాయిప్రియసేవా సమితి సిబ్బంది రేలంగిసూర్య, విప్పర్తిశ్రీను, సాయిప్రియ సేవ‌సమితి కార్యదర్శి మేకల కృష్ణ తదితరులు ఆహర పానీయ వడ్డనలో పాల్గొని రైతులకు తమ సేవలను అందించించారు. శ్రీమతి డోక్కా సీతమ్మఅన్నపానీయసదుపాయ కేంద్రమునకు శ్రమశక్తి ద్వారా రైతులకు, పశువుల బేరాల మధ్యవర్తులకు, పేషెంట్ లకు ప్రత్యేకమైన సేవలు అందిస్తూన్న వారిని ప్రత్యేకంగా సాయిప్రియసేవాసమితి చైర్మన్ జ్యోతుల గంగభవానీ శ్రీనివాసు చరవాణిలో వారిని ఆమె అభినందించారు.